వాగు దాటి పొలాలకు చేరాల్సిందే..
ABN, First Publish Date - 2022-08-11T05:54:14+05:30
మండలంలోని జమ్మానిపల్లి రైతులకు భారీ వర్షా లు కొత్త కష్టాన్ని తెచ్చిపెట్టాయి. వర్షాలతో వాగులు ఇంకా ప్రవహిస్తూనే ఉన్నాయి
మడకశిర రూరల్. ఆగస్టు 10: మండలంలోని జమ్మానిపల్లి రైతులకు భారీ వర్షా లు కొత్త కష్టాన్ని తెచ్చిపెట్టాయి. వర్షాలతో వాగులు ఇంకా ప్రవహిస్తూనే ఉన్నాయి. దీం తో సమీపంలోని పంట పొలాలకు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. గతంలో ఉన్న మట్టి రోడ్లు సైతం నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. దీంతో ప్రస్తుతం దారి లేకుండా పోయింది. వాగు నీరు, ఇసుకలో ఎద్దుల బండ్లు, ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు అష్టకష్టాలు పడు తున్నారు. పొలాలకు వెళ్లాలంటే సరైన దారిలేక వంక దాటి వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్థులు వాపోతున్నారు. పొలాలకు దారి చూపాలని, వంకకు వంతెన ని ర్మించాలని పలుమార్లు స్థానిక ఎమ్మెల్యేకు విన్నవించినా స్పందించలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పొలాలకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
Updated Date - 2022-08-11T05:54:14+05:30 IST