అనుమానాస్పద స్థితిలో గ్రామ వలంటీర్ మృతి
ABN, First Publish Date - 2022-08-09T05:27:05+05:30
మండలంలోని సం జీవరాయునిపల్లికి చెందిన హనుమంతరాయప్ప, శాంతమ్మల పెద్ద కుమారుడు, గ్రామ వలంటీర్ నాగరాజు (24) సోమవారం అనుమానాస్పద స్థితి లో మృతి చెందాడు.
హిందూపురం, ఆగస్టు 8: మండలంలోని సం జీవరాయునిపల్లికి చెందిన హనుమంతరాయప్ప, శాంతమ్మల పెద్ద కుమారుడు, గ్రామ వలంటీర్ నాగరాజు (24) సోమవారం అనుమానాస్పద స్థితి లో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలి వి. నాగరాజు డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు చదివా డు. ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయా డు. సాయంత్రమైనా రాకపోవడంతో తల్లిదండ్రు లు అతని ఫోనకి కాల్ చేస్తే స్విచ ఆఫ్ అయినట్లు తెలిసింది. దాంతో బంధువులు, స్నేహితులతో ఆచూకీ కోసం ఆరాతీసారు. ఆచూకీ లభించలే దు. ఈక్రమంలో సోమవారం గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్ద కు వెళ్లగా నాగరాజు చెప్పులు కనపడ్డాయి. అనుమానం వచ్చి బావిలో ది గి చూడగా మృతదేహం లభ్యమైంది. సమాచారంతో ఎస్ఐ కరీం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం హిందూపురం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2022-08-09T05:27:05+05:30 IST