వైభవంగా వెంకటేశ్వరుని పవిత్రోత్సవాలు
ABN, First Publish Date - 2022-08-15T05:21:47+05:30
స్థానిక కొత్తపేటలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు ఆదివారంతో ముగిసాయి.
ధర్మవరంరూరల్, ఆగస్టు 14: స్థానిక కొత్తపేటలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు ఆదివారంతో ముగిసాయి. చివరి రోజు ఆలయ అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవెంకటేశ్వరుని ప్రతిమలను అలంకరించి విశేషపూజలు చేశారు. రెండు రోజుల పాటు సుదర్శనయాగం, పూర్ణాహుతి కార్యక్రమాలను తిరుమల, తిరుపతి ఆచార సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయకమిటీ సభ్యులు అన్నదానం చేపట్టారు
Updated Date - 2022-08-15T05:21:47+05:30 IST