వైసీపీ ఎమ్మెల్సీ అనుచరుల వీరంగం
ABN, First Publish Date - 2022-01-17T06:24:51+05:30
వైసీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి అనుచరులు తమపై వేట కొడవళ్లతో దాడి చేశారని కొనకొండ్ల గ్రామానికి చెందిన ప్రమీల వాపోయారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనుచరుల వీరంగం
వేట కొడవళ్లతో దాడి.. కేసు నమోదు
వజ్రకరూరు, జనవరి 16 : వైసీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి అనుచరులు తమపై వేట కొడవళ్లతో దాడి చేశారని కొనకొండ్ల గ్రామానికి చెందిన ప్రమీల వాపోయారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. శివరామిరెడ్డి అనుచరులు తమ ఇంటి వద్ద పూడ్చిన దిగుడు బావిని తిరిగి తవ్వుతూ ఆ మట్టిని తమ స్థలంలో వేశారని, దానిపై ప్రశ్నించినందుకు రాళ్లతో దాడి చేసి.. వేటకొడవళ్లతో చంపడానికి వచ్చారని వాపోయారు. విషయాన్ని ఫోన ద్వారా పోలీసులకు తెలిపామని, పోలీసులు వచ్చినా వారి సమక్షంలోనే తిరిగి తమపై దాడికి పాల్పడ్డారని అన్నారు. పోలీసులు వేట కొడవళ్లను స్వాధీనం చేసుకున్నారన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఉరవకొండ సీఐ శేఖర్ తెలిపారు.
Updated Date - 2022-01-17T06:24:51+05:30 IST