ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

ABN, First Publish Date - 2022-08-13T06:08:47+05:30

మండలంలోని కనుంపల్లి సమీపాన 44వ జాతీయ రహదారిపై శుక్రవారం కారు, బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు.

భీమప్ప, మోహనప్ప మృతదేహాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గార్లదిన్నె, ఆగస్టు 12: మండలంలోని కనుంపల్లి సమీపాన 44వ జాతీయ రహదారిపై శుక్రవారం కారు, బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. గార్లదిన్నె పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా మలకాపల్లికి చెందిన చాకలి భీమప్ప (35), చాకలి మోహనప్ప (25) బెంగుళూరులో తాపీమేస్ర్తీ పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఇటీవలే మోహర్రం వేడుకలకు స్వగ్రామానికి వచ్చారు. వేడుకలు ముగించుకుని శుక్రవారం ద్విచక్రవాహనంలో బెంగుళూరుకు బయల్దేరారు. కనుంపల్లి వద్దకు రాగానే ఎదురుగా గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన వ్యక్తి కారులో వస్తూ ఢీకొన్నారు. ప్రమాదంలో భీమప్ప అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గా యపడిన మోహనప్పను 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలి స్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కారు డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు పోలీసు లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, దరాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కిరణ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. మృతుడు భీమప్పకు భార్య ఇద్దరు పిల్లలున్నారు.

Updated Date - 2022-08-13T06:08:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising