ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగుదేశంతోనే రాష్ట్ర భవిష్యత్తు : గుండుమల

ABN, First Publish Date - 2022-06-28T06:23:04+05:30

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, టీడీపీతోనే భవిష్యత్తు అని ప్రజలు విశ్వసిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అన్నారు.

టీడీపీలోకి ఆహ్వానిస్తున్నరాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మడకశిర టౌన, జూన 27: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, టీడీపీతోనే భవిష్యత్తు అని ప్రజలు విశ్వసిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అన్నారు. స్థానిక బాలాజీ నగర్‌ పార్టీ కార్యాలయంలో సోమవారం మండలంలోని కల్లుమర్రి పంచాయతీకి చెందిన పలువురు వైసీపీ నాయకులు టీడీపీలోకి చేరారు. వైసీపీ నాయకులు కోట్ల అనిల్‌కుమార్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి తమ అనుచరులతో టీడీపీ తీర్థం పుచ్చుకొన్నారు. వీరికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తిప్పేస్వామి మాట్లాడు తూ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు... రాష్ట్ర భవిష్యత్తును మార్చుతారన్న అశతో జనం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షుడు నాగరాజు, పట్టణ అఽధ్యక్షుడు మనోహర్‌, మైనార్టీ జిల్లా అ ధ్యక్షుడు భక్తర్‌, పట్టణ యువత అధ్యక్షులు తిమ్మరాజు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-28T06:23:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising