టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యం
ABN, First Publish Date - 2022-07-04T05:06:14+05:30
రాయలసీమ గ్రాడ్యుయేషన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి గెలుపే లక్ష్యమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి, తనయుడు డాక్టర్ ఉన్నం మారుతి చౌదరి అన్నారు
ఉన్నంతో రాంగోపాల్రెడ్డి భేటీ
కంబదూరు (కళ్యాణదుర్గం), జూలై 3 : రాయలసీమ గ్రాడ్యుయేషన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి గెలుపే లక్ష్యమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి, తనయుడు డాక్టర్ ఉన్నం మారుతి చౌదరి అన్నారు. భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి ఆదివారం వీరిని మర్యాదపూర్వకంగా కళ్యాణదుర్గం పట్టణంలోని ఉన్నం వ్యక్తిగత కార్యాలయంలో కలిశారు. వారందరూ పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉన్నం హనుమంత రాయచౌదరి మాట్లాడుతూ.. గ్రాడ్యుయేషన ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక గ్రాడ్యుయేట్లను ఎక్కువగా ఓటర్లుగా నమోదు చేయించి పార్టీ అభ్యర్థి అయిన భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డిని గెలిపించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో టీడీపీ నాయకులు ఆర్జీ శివశంకర్, డీకే రామాంజినేయులు, కొల్లాపురప్ప, జ్యోతిర్మయి కళాశాల కరస్పాండెంట్ రాము, రామలింగప్ప, సత్యనారాయణ, సత్తి, బొజ్జన్న, షామీర్ మునీర్ ఉన్నారు.
Updated Date - 2022-07-04T05:06:14+05:30 IST