ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గతి నాశనీ.. శరణు.. శరణు..

ABN, First Publish Date - 2022-10-04T05:15:12+05:30

శరన్నవరాత్రి ఉత్సవాల ఎనిమిదో రోజు సోమవారం సకల దుర్గతులను బాపెడి దుర్గాదేవిగా అమ్మవారు జిల్లావ్యాప్తంగా భక్తులకు దర్శనమిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుట్టపర్తి/కదిరి: శరన్నవరాత్రి ఉత్సవాల ఎనిమిదో రోజు సోమవారం సకల దుర్గతులను బాపెడి దుర్గాదేవిగా అమ్మవారు జిల్లావ్యాప్తంగా భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో దుర్గాష్టమి ప్రత్యేకం. దీంతో అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి, పూజలు చేశారు. భక్తులు పెద్దఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు.

    శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కదిరిలో వెలసిన ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవీభూదేవి సమేతుడైన శ్రీవారికి అర్చకులు మోహినీ అలంకారం చేశారు. సుగంధ ద్రవ్యాలు, కదిరి మల్లెలతో అలంకరించారు. మోహినీ అవతారంలో కొలువైన శ్రీవారిని దర్శించుకుని, భక్తులు తన్మయత్వం పొందారు.


Updated Date - 2022-10-04T05:15:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising