ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-06-30T05:29:49+05:30

కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి భాస్కర్‌రెడ్డి (44) మృతిచెందిన సంఘటన బుధవారం మండలం లోని కేశవరాయునిపేట గ్రా మంలో జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాడికి, జూన్‌ 29: కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి భాస్కర్‌రెడ్డి (44) మృతిచెందిన సంఘటన బుధవారం మండలం లోని కేశవరాయునిపేట గ్రా మంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలమేరకు కేశవరా యునిపేట గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి తనకు ఉన్న 10ఎకరాల పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ వృద్ధులైన తల్లిదండ్రులను చూసు కుంటూ జీవనం సాగిస్తున్నాడు. భాస్కర్‌రెడ్డికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యను పెళ్లి అయిన రెండేళ్లకే వదిలేసి ఆ తర్వాత గుంటూరుకు చెందిన కల్పనను వివాహం చేసుకు న్నాడు. ఆమె గుంటూరులోనే ఉంటూ అక్కడికే రావాలని ఒత్తిడి చేసేది. సొంత గ్రామంలో తల్లిదం డ్రులను వదిలి వెళ్లలేక, అక్కడ భార్యను వదిలి ఉండలేక సతమ తమయ్యేవాడు.  మంగళవారం రాత్రి కేశవరా యునిపేటలో పురు గుల మందు తాగి ఆత్మహ త్యాయత్నం చేశాడని, చికిత్స నిమిత్తం అనంతపురం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించామని పోలీసులు తెలిపారు. 


Updated Date - 2022-06-30T05:29:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising