ఖాద్రీశుడి ఆలయంలో 26 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
ABN, First Publish Date - 2022-09-24T05:11:29+05:30
పట్టణంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 26వ తేదీ నుంచి అక్టోంబరు 5 వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ పట్టెం గురుప్రసాద్, కమిటీ చైర్మన జెరిపిటి గోపాలకృష్ణ శుక్రవారం ప్రకటనలో తెలిపారు.
కదిరి, సెప్టెంబరు 23: పట్టణంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 26వ తేదీ నుంచి అక్టోంబరు 5 వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ పట్టెం గురుప్రసాద్, కమిటీ చైర్మన జెరిపిటి గోపాలకృష్ణ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 26న మత్స్యావతారం, 27న కూర్మావతారం, 28న నృసింహ, 29న శ్రీరామ, 30న శ్రీకృష్ణ, అక్టోబరు 1న శ్రీపరమపదనాథ, 2న సరస్వతి, 3న మోహిని, 4న శ్రీవెంకటేశ్వర అలంకారాల్లో శ్రీవారు.. భక్తులకు దర్శనమిస్తామన్నారు. 5న విజయదశమి అశ్వవాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తామన్నారు.
Updated Date - 2022-09-24T05:11:29+05:30 IST