సగరులు రాజకీయంగా ఎదగాలి
ABN, First Publish Date - 2022-05-28T06:21:46+05:30
జిల్లాలోని సగరులు రాజకీయంగా ఎదగాలని రాష్ట్ర సగరు ల కార్పొరేషన మాజీ డైరెక్టర్ శ్రీకాంత పిలుపునిచ్చారు. శుక్రవారం మండ లంలోని గొబ్బరంపల్లిలో భగీరథ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
సగర కార్పొరేషన మాజీ డైరెక్టర్ శ్రీకాంత
రొద్దం, మే 27: జిల్లాలోని సగరులు రాజకీయంగా ఎదగాలని రాష్ట్ర సగరు ల కార్పొరేషన మాజీ డైరెక్టర్ శ్రీకాంత పిలుపునిచ్చారు. శుక్రవారం మండ లంలోని గొబ్బరంపల్లిలో భగీరథ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా మహిళలు కలశాలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం నా యకులు మాట్లాడుతూ సగరులు సమాజంలో ఇంకా వెనుకబడి ఉన్నారని తెలిపారు. ప్రతిఒక్కరూ పిల్లల్ని బాగా చదివించి ఆర్థిక, రాజకీయ, సామాజికంగా ఎదగాలని కోరారు. సగరులకు చట్టసభలో అత్యధిక స్థానాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా సగర కులస్థుల్లో నూతనంగా ఎంపికై న సర్పంచులు, ఎంపీటీసీలు, భగీరథ విగ్రహానికి రూ.5వేలు పైబడి చందాలు ఇచ్చిన సగర కులస్థులను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర సగర కార్పొరేషన డైరెక్టర్ మావటూరు నరసింహప్ప, మాజీ ఎంపీపీ చలపతి, మావటూ రు సర్పంచ నాగరాజు, సింగిల్విండో డైరెక్టర్ కొల్లప్ప, పావగడ నాగరాజు, కే తగానిచెరువు నరసింహులు, దొడగట్ట ఎంపీటీసీ బాలాజీ, ఉప్పర సంఘం అ ధ్యక్షుడు గోపాల్, గొబ్బరంపల్లి సగర కులస్థులు, కుల పెద్దలు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-28T06:21:46+05:30 IST