ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rambhupal: గోరంట్లది నాలుగు గోడల మధ్య జరిగిన వ్యవహారం కాదు

ABN, First Publish Date - 2022-08-16T18:26:10+05:30

ఎంపీ గోరంట్లది నాలుగు గోడల మధ్య జరిగిన వ్యవహారం కాదని సీపీఎం నేత రాంభూపాల్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం (Anantapuram): వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ (MP Gorantla) ది నాలుగు గోడల మధ్య జరిగిన వ్యవహారం కాదని అనంతపురం జిల్లా సీపీఎం కార్యదర్శి  రాంభూపాల్ (Rambhupal)అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తప్పు చేసిన వారిని ప్రభుత్వం సమర్థించడంతో గోరంట్ల ఊరు మీద పడి అంబోతులా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎంపీని కంట్రోల్ చేయకపోతే నేరస్థులను ఏ విధంగా కంట్రోల్ చేస్తారని ప్రశ్నించారు. గోరంట్ల మాధవ్ చర్యను జిల్లా జడ్పీ చైర్మన్ గిరిజమ్మ, మంత్రి ఉష శ్రీ (Usha Shri) సమర్థించే విధంగా మాట్లాడుతున్నారని, వారు ఏవిధంగా సమర్ధిస్తారని నిలదీశారు. సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తీవ్రమైన చర్య తీసుకుంటామంటే మహిళా మంత్రుల చేత ఎదురు దాడి చేయడమా?.. గోరంట్ల మాధవ్ నోరు మూసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు, కులానికి ఏమి సంబంధమన్నారు. కురుబ కులస్తులు గ్రామాల్లో చాలా సఖ్యతగా ఉంటారన్నారు. గోరంట్ల తన రాజకీయ స్వార్థం కోసం గ్రామంలో వైషమ్యాలు లేపుతారా? అంటూ దుయ్యబట్టారు. అనంతపురం జిల్లాలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. గోరంట్ల లాంటి తప్పుడు మనుషులను సమర్థిస్తే ప్రజా క్షేత్రంలో బుద్ధి చెబుతారని రాంభూపాల్ అన్నారు.

Updated Date - 2022-08-16T18:26:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising