ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Payyavula Keshav: ఏ ఒక్కరినీ వదిలి పెట్టం..

ABN, First Publish Date - 2022-08-25T20:34:47+05:30

వైసీపీ శ్రేణులు కుప్పంలో అన్న క్యాంటీన్ ధ్వంసం చేయడం దుర్మార్గమని పయ్యావుల కేశవ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం (Anantapuram): వైసీపీ (YCP) శ్రేణులు కుప్పంలో అన్న క్యాంటీన్ (Anna canteen) ధ్వంసం చేయడం దుర్మార్గమని టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కార్యకర్త రక్తం చూసిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టబోమని హెచ్చరించారు. కుప్పంలో వైసీపీ నేతలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పర్యటనను అడ్డుకునే కుట్రలు సిగ్గుచేటన్నారు. అసలు జగన్ రెడ్డి (Jagan reddy)కి సిగ్గుందా? అని ప్రశ్నించారు. పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ కూలుస్తారా?.. టీడీపీ కార్యకర్తపై చెయ్యి ఎత్తిన ఏ ఒక్కడినీ వదిలేది లేదని మరోసారి స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్త వంటి నుంచి కారిన ప్రతి రక్తపు చుక్కా రేపు చురకత్తి కాబోతోందని, వచ్చే ఎన్నికల తర్వాత జగన్ రెడ్డికి చుక్కలు చూపించడం ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త తిరగబడితే ఎలా ఉంటుందో చూపిస్తామని పయ్యావుల కేశవ్ అన్నారు.

Updated Date - 2022-08-25T20:34:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising