ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహానాడును విజయవంతం చేయండి : బీకే

ABN, First Publish Date - 2022-05-25T05:25:28+05:30

ఒంగోలులో ఈనెల 27, 28 తేదీల్లో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని హిం దూపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి పిలుపునిచ్చారు.

సమావేశంలో మాట్లాడుతున్న పార్థసారథి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుకొండ, మే 24: ఒంగోలులో ఈనెల 27, 28 తేదీల్లో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని హిం దూపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి పిలుపునిచ్చారు. మంగళవా రం స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ నాయకులతో ఆయన సమావేశ మై మాట్లాడారు. సోమందేపల్లిలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక్క పిలుపుతోనే వేలాది మంది చంద్రబాబు బ హిరంగ సభకు తరలివచ్చారన్నారు. క్రమశిక్షణకు మారుపేరు టీడీపీ కార్యకర్తలేనన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషిచేయాలన్నారు. మహానాడు తరువాత ప్రతి గ్రామంలో పర్యటిస్తామని, అందరిని కలుపుకుని ముందుకెళ్లాలన్నారు. మహానాడుకు నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. సమావేశంలో హిందూపురం కార్యనిర్వాహక కార్యదర్శి మునిమడుగు వెంకటరాముడు, కన్వీనర్లు శ్రీరాములుయాదవ్‌, సిద్దలింగప్ప, నరహరి, అనుబంధ కమిటీ సభ్యులు, నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-25T05:25:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising