చిరుత మృతి
ABN, First Publish Date - 2022-08-11T05:19:54+05:30
మండల పరిధిలోని మాలనాయకనహళ్లి (మాలేపల్లి) గ్రామ సమీపంలో అనుమానాస్పదస్థితిలో మంగళవారం రాత్రి ఓ చిరుతపులి మృతి చెందింది.
శెట్టూరు, ఆగస్టు 10: మండల పరిధిలోని మాలనాయకనహళ్లి (మాలేపల్లి) గ్రామ సమీపంలో అనుమానాస్పదస్థితిలో మంగళవారం రాత్రి ఓ చిరుతపులి మృతి చెందింది. అయితే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందా? లేక వేటగాళ్ల ఉచ్చులో బలయిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిరుతపులి కళేబరంపై ఎలాంటి గాయాలు లేవు. అయితే పులి నోటిలో నుంచి రక్తం రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్థానికంగా ఎవరైనా కొట్టి చంపారా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అటవీశాఖాధికారులు మాత్రం ప్రమాదంతోనే మృతి చెందినట్లు వెల్లడించారు. ఏదో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి మృతి చెంది ఉంటుందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి డీఆర్వో లక్ష్మప్ప, పెనుగొండ సబ్ డీఎ్ఫవో శామిల్, ఎఫ్ఆర్వో రామ్సింగ్ లు వెళ్లి చిరుతపులికి పంచనామ నిర్వహించారు. అనంతరం అక్కడే చిరుతను దహనం చేశారు.
Updated Date - 2022-08-11T05:19:54+05:30 IST