దారుణం: ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కోసం వెళ్తే ప్రాణం తీసేశారు
ABN, First Publish Date - 2022-07-29T01:03:58+05:30
అనంతపురం: ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కోసం వచ్చిన ఆమెకు మరో ఆపరేషన్ చేశారు. పరిస్థితి విషమించడంతో మరో ఆస్పత్రిని తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణలోదిలింది. ఈ ఘటన అనంతపురంలో జరిగింది.
అనంతపురం: ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కోసం వచ్చిన ఆమెకు మరో ఆపరేషన్ చేశారు. పరిస్థితి విషమించడంతో మరో ఆస్పత్రిని తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణలోదిలింది. ఈ ఘటన అనంతపురంలో జరిగింది.
కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స కోసం కుటుంబసభ్యులు సుమలతను అనంతపురంలోని సన్రైజ్ హాస్పిటల్కు తీసుకువచ్చారు. డా. చంద్రకళ ఆమెకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్కు బదులుగా పేగులను బ్లాక్ చేసేసింది. దీంతో సుమలత పరిస్థితి విషమించడంతో వెంటనే కర్నూలులోని మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ చనిపోయింది. ఆగ్రహానికి లోనైన సుమలత కుటుంబసభ్యులు, బంధువులు సన్రైజ్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
Updated Date - 2022-07-29T01:03:58+05:30 IST