ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కార్మికలోకం చంద్రబాబుకు అండగా నిలవాలి’

ABN, First Publish Date - 2022-05-19T05:51:08+05:30

రాష్ట్ర అభివృద్ధి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని, ఆయనకు కార్మికలోకమంతా అండగా నిలవాలని టీఎనటీయూసీ హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు నాగభూషణం పిలుపునిచ్చారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీఎనటీయూసీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం రూరల్‌, మే 18: రాష్ట్ర అభివృద్ధి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని, ఆయనకు కార్మికలోకమంతా అండగా నిలవాలని టీఎనటీయూసీ హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు నాగభూషణం పిలుపునిచ్చారు. బుధవారం ఆయన రాష్ట్ర కార్యదర్శి కుంచెపు వడ్డే వెంకటేశులుతో కలిసి అనంతపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలే కర్ల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు అవస్థలు వర్ణనాతీతమన్నారు. కార్మికులకు మంచి రోజులు రావాలంటే చంద్రబాబు మరోసారి సీఎం కావాలన్నారు. ఈనెల 20న శ్రీసత్యసాయి జిల్లాలోని సోమందేపల్లికి వస్తున్న ఆయనకు కార్మికులు పెద్దఎత్తున తరలివచ్చి మద్దతు పలకాలన్నారు. కార్యక్రమంలో టీఎనటీయూసీ హిందూపురం పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు బాలాంజనేయులు, కార్యదర్శి సాంబశివ, రూరల్‌ మండల అధ్యక్షుడు పామురాయి రాంబాబు, కార్యదర్శి సుబ్బు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-19T05:51:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising