కబడ్డీ చాంపియన రాజస్థాన జట్టు
ABN, First Publish Date - 2022-05-26T06:21:06+05:30
జేసీ నాగిరెడ్డి మెమోరియల్ నేషనల్ ఇన్విటేషనల్ మహిళా కబడ్డీ టోర్నీలో రాజస్థాన జట్టు చాంపియనగా అవతరించింది.
ఫైనల్లో పానిపట్టుపై విజయం
తాడిపత్రి, మే 25: జేసీ నాగిరెడ్డి మెమోరియల్ నేషనల్ ఇన్విటేషనల్ మహిళా కబడ్డీ టోర్నీలో రాజస్థాన జట్టు చాంపియనగా అవతరించింది. మూడురోజుల పాటు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. రాజస్థాన, పానిపట్టు జట్ల మధ్య బుధవారం రాత్రి ఫైనల్ మ్యాచ హోరాహోరీగా సాగింది. పానిపట్టు జట్టుపై రాజస్థాన విజయం సాధించి, రూ.2 లక్షల ప్రైజ్మనీతో పాటు ట్రోఫీని సొంతం చేసుకుంది. రెండో స్థానంలో నిలిచిన పానిపట్టు జట్టుకు రూ.లక్షన్నర, ట్రోఫీ అందజేశారు. మూడోస్థానంలో నిలిచిన హరియాణ జట్టుకు రూ.లక్ష, నాలుగో స్థానంలో వెస్ట్రన రైల్వే జట్టుకు రూ.50 వేల నగదు బహుమతి అందజేశారు. మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి జేసీ అశ్మితరెడ్డి, కుటుంబసభ్యులు బహుమతులను అందజేశారు.
Updated Date - 2022-05-26T06:21:06+05:30 IST