జై హనుమాన..
ABN, First Publish Date - 2022-08-22T05:13:55+05:30
మకల్లులో శ్రావణమాసం సందర్భంగా ఆదివారం వేకువజామున ఆంజనేయస్వామి ఉచ్చాయం, అనంతరం మడుగుతేరు లాగి బ్రహ్మరథోత్సవాలను ప్రారంభించారు.
నేమకల్లులో వైభవంగా బ్రహ్మరథోత్సవం
బొమ్మనహాళ్, ఆగస్టు 21: నేమకల్లులో శ్రావణమాసం సందర్భంగా ఆదివారం వేకువజామున ఆంజనేయస్వామి ఉచ్చాయం, అనంతరం మడుగుతేరు లాగి బ్రహ్మరథోత్సవాలను ప్రారంభించారు. స్వామివారికి వేకువజామున సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, నిర్మల్య విసర్జన, విష్ణుపారాయణం, అష్టోత్తరం నిర్వహించారు. అనంతరం ఉదయం మడుగు తేరును లాగి, సాయంత్రం 5 గంటలకు బ్రహ్మరథోత్సవంను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు తరలివచ్చారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ శివ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు, సర్పంచ పరమేష్, టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ బెళ్లి హనుమంతరెడ్డి, గాలి బసప్ప, మాజీ ధర్మకర్త శాంతయ్య పాల్గొన్నారు.
Updated Date - 2022-08-22T05:13:55+05:30 IST