పేటెంట్లతో జేఎనటీయూకి అంతర్జాతీయ గుర్తింపు : వీసీ
ABN, First Publish Date - 2022-09-24T05:12:04+05:30
నూతన అంశాలపై పరిశోధన చేసి, వాటి పేటెంట్లను దక్కించుకుంటున్న జేఎనటీయూకి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందని వీసీ రంగజనార్దన తెలిపారు.
అనంతపురం సెంట్రల్, సెప్టెంబరు 23: నూతన అంశాలపై పరిశోధన చేసి, వాటి పేటెంట్లను దక్కించుకుంటున్న జేఎనటీయూకి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందని వీసీ రంగజనార్దన తెలిపారు. రహదారుల నిర్మాణంలో వినియోగించే తారు చిక్కదనాన్ని గుర్తించే పరికరాన్ని కనుగొన్నందుకు పేటెంట్ పొందిన మాజీ రిజిస్ర్టార్, సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ క్రిష్ణయ్యను శుక్రవారం వీసీ సన్మానించి అభినందించారు. ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ క్రిష్ణయ్య పొందిన పేటెంట్లు వర్సిటీకి, ఇంజనీరింగ్ కళాశాలకు గర్వకారమణమన్నారు. వర్సిటీ పరిధిలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు నూతన పద్ధతుల్లో సమాజ అవసరాలను తీర్చేవిధంగా పరిశోధనలు చేసి భారత ప్రభుత్వంచే పేటెంట్లను పొందాలన్నారు. కార్యక్రమంలో రెక్టార్ విజయకుమార్, రిజిస్ర్టార్ శశిధర్, డైరక్టర్లు శోభాబిందు, సుబ్బారెడ్డి, కోఆర్డినేటర్ భువనవిజయ, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ భవాని తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-09-24T05:12:04+05:30 IST