ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడిరైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-10-12T05:33:40+05:30

మండలంలోని వసంతపురం గ్రామానికి చెందిన పాడిరైతు చెలిమి వెంకటరామయ్య(50) ఊజిమాత్రలు మింగి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు

చెలిమి వెంకటరామయ్య (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మవరం రూరల్‌, అక్టోబరు 11: మండలంలోని వసంతపురం గ్రామానికి చెందిన పాడిరైతు చెలిమి వెంకటరామయ్య(50) ఊజిమాత్రలు మింగి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. చెలిమి వెంకటరామయ్య పాడిఆవులను పోషించుకుంటూ జీవనం సాగించేవాడు. రెండేళ్ల నుంచి ఆయన కడుపునొప్పితో బాధపడేవాడు. ఇటీవలే తిరుపతిలో శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. అయినప్పటికీ జబ్బు నయం కాకపోవడంతో వెంకటరామయ్య మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఊజీమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. మృతుడికి భార్య భారతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 


Updated Date - 2022-10-12T05:33:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising