ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో మైనార్టీలకు తీవ్ర అన్యాయం

ABN, First Publish Date - 2022-08-06T05:05:09+05:30

వైసీపీ హయాంలో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శిం చారు.

ఆర్థిక సాయం అందజేస్తున్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మాజీ మంత్రి పల్లె

బుక్కపట్నం, ఆగస్టు 5: వైసీపీ హయాంలో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శిం చారు. శుక్రవారం కొత్తచెరువు మండల కేంద్రంలో ఇసుక వంకవీధిలో నూతనంగా ఏర్పాటుచేసిన పీర్లచావిడిని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రారంభిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... టీడీపీ హయాంలో మైనార్టీలకు అన్నివిధాలుగా అండగా ఉంటూ వారి సంక్షేమం కోసం కృషిచేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు. అనంతరం మండల కేంద్రంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తలు విష్ణువర్ధన, ఆంజనేయలు, పెద్దన్న, శ్రీరాములు, అక్కమ్మ, సత్తి తదితరుల వద్దకు వెళ్లి వారిని ఓదార్చారు. ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం అందిం చారు. కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పల్లెరఘునాథ రెడ్డికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు. ఆయన వెంట పార్లమెంట్‌ అధికార ప్రతినిధి సాలక్కగారి శ్రీనివాసులు, పట్టణ, రూరల్‌ కన్వీనర్‌లు రామక్రిష్ణ, ఒలిపి శ్రీనివాసులు, నాయకులు గాజుల చంద్రమోహన, నాగేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-06T05:05:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising