ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడకు వెళ్లొద్దు

ABN, First Publish Date - 2022-09-22T05:07:57+05:30

విజయవాడలో గురువారం జరిగే మహాధర్నాకు వెళ్లొద్దని ఉపాధ్యాయ సంఘం నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

నరసింహులుకు నోటీసు ఇస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఉపాధ్యాయ నేతలకు పోలీసుల నోటీసులు

అనంతపురం విద్య, సెప్టెంబరు 21: విజయవాడలో గురువారం జరిగే మహాధర్నాకు వెళ్లొద్దని ఉపాధ్యాయ సంఘం నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నరసింహులు, జిల్లా అధ్యక్షుడు వెంకటేషులు, ప్రధానకార్యదర్శి సిరాజుద్దీన్‌ తదితర రాష్ట్ర, జిల్లా నాయకులకు నోటీసులు అందించారు. ఉపాధ్యాయ సమస్యలపై వందరోజుల పోరుబాటలో భాగంగా గురువారం విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నారు. సీపీఎస్‌ రద్దు, తరగతుల విలీనం రద్దు, టీచర్ల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లతో ఉపాధ్యాయులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉద్యమాన్ని అడ్డుకునేలా పోలీసులతో ప్రభుత్వం నోటీసులు ఇప్పించడం సరికాదని నాయకులు అన్నారు. నోటీసులు, అరెస్టులతో ఉద్యమాలను అణచివేయలేరని హెచ్చరించారు.


Updated Date - 2022-09-22T05:07:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising