ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎవరు అడ్డం వస్తే వాళ్లను చంపేస్తున్నారు... వైఎస్‌ను కూడా ఏం చేసేవారో?: Narayana

ABN, First Publish Date - 2022-02-17T18:26:21+05:30

రాష్ట్రంలో భయంకరమైన వాతావరణం ఏర్పడుతోందని సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై  సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో భయంకరమైన వాతావరణం ఏర్పడుతోందని అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ...కోల్డ్ మర్డర్ వ్యవస్థ ఏపీలో ఉందని.. ఇది అత్యంత ప్రమాదకరమైన అంశమన్నారు. వైఎస్ వివేకా హత్యపై రాష్ట్రంలో చర్చ జరుగుతోందని తెలిపారు. ఏకంగా సీబీఐపైనే సుప్రీంకోర్టుకు వెళ్తానని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి అంటున్నారన్నారు.


వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారన్నది కోర్టులో వివాదం నడుస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఎవరు అడ్డం వస్తే వాళ్ళని చంపేస్తున్నారని... వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్డం ఉంటే ఆయనను కూడా ఏం చేసేవారో అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఉధ్దేశించి ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అంత అనుమానంతో కూడిన రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో వచ్చాయన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే సీబీఐను సపోర్ట్ చేస్తారు లేకుంటే వ్యతిరేకిస్తారని నారాయణ అన్నారు. 

Updated Date - 2022-02-17T18:26:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising