స్నేహం పేరుతో మోసం
ABN, First Publish Date - 2022-09-18T04:52:30+05:30
స్నేహం పేరుతో మోసం చేశారని పట్టణానికి చెందిన ఓ యువతి నలుగురిపై శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కదిరి అర్బన,సెప్టెంబరు 17: స్నేహం పేరుతో మోసం చేశారని పట్టణానికి చెందిన ఓ యువతి నలుగురిపై శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణ సీఐ మధు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని ఓ హెటల్లో స్నేహం పేరుతో ఓయువతిని మోసం చేశారు. ఆదృశ్యాలను సీసీ కెమెరాల్లో రికార్డుచేసి యువతిని బెదిరిస్తున్నట్లు తెలిపారు. దీనిపై పట్టణంలోని ముజమ్మిల్, ముజీబ్, హసీనా, ఇంతియాజ్లపై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Updated Date - 2022-09-18T04:52:30+05:30 IST