బస్సు చార్జీలు తగ్గించాలి
ABN, First Publish Date - 2022-07-02T04:58:12+05:30
పెంచిన బస్సు చార్జీలు వెంటనే తగ్గించాలని రాయలసీమ కమ్యూనిస్టు నాయకులు డిమాండు చేశారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండులో జిల్లా కార్యదర్శి నాగన్న ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
రాయలసీమ కమ్యూనిస్టు నాయకుల డిమాండ్
పుట్టపర్తి , జూలై 1 : పెంచిన బస్సు చార్జీలు వెంటనే తగ్గించాలని రాయలసీమ కమ్యూనిస్టు నాయకులు డిమాండు చేశారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండులో జిల్లా కార్యదర్శి నాగన్న ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. జగన ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేస్తూ టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించారని నేడు అధికారం లోకి వచ్చిన జగన అన్ని నిత్యావసర వస్తువుల ధరలను పెంచి ప్రజలపై తీవ్రభారం మోపా రని మండిపడ్డారు. ఒకే సంవత్సరంలో మూడు సార్లు బస్సు చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, సుగుణమ్మ, మున్నా శివమ్మ రాజమ్మ ఆరుణ్ పాల్గొన్నారు.
Updated Date - 2022-07-02T04:58:12+05:30 IST