ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో బోల్తా: ఒకరి మృతి

ABN, First Publish Date - 2022-10-08T05:35:54+05:30

మండలంలోని జక్కల చెరువులోని 63వ జాతీయ రహదారిపై శుక్రవారం ఆటో బోల్తాపడి లక్ష్మిదేవి (63) మృతి చెం దింది. మరో ఎనిమిది మంది మహిళా కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.

లక్ష్మీదేవి మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఎనిమిది మంది మహిళా కూలీలకు గాయాలు

గుత్తి రూరల్‌, అక్టోబరు 7: మండలంలోని జక్కల చెరువులోని 63వ జాతీయ రహదారిపై శుక్రవారం ఆటో బోల్తాపడి లక్ష్మిదేవి (63) మృతి చెం దింది. మరో ఎనిమిది మంది మహిళా కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీ సులు తెలిపిన మేరకు.. గుత్తి పట్టణంలోని చెర్లోపల్లి కాలనీకి చెందిన పదిమంది కూలీలు పెద్దవడుగూరు మండలంలోని తిమ్మాపురానికి మిరపకాయలను కోయడా నికి ఆటోలో బయల్దేరారు. జక్కలచెరువులోకి రాగానే కుక్క అడ్డంరావడంతో దాన్ని తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లక్ష్మిదేవి, పుల్లమ్మ, జరీనా, కళ, పద్మావతి, లక్ష్మి, శివలక్ష్మి, గంగాదేవి, లత తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతు లక్ష్మిదేవి మృతి చెందింది. పుల్లమ్మ, గంగాదేవిలను మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-10-08T05:35:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising