Paritala Sunita, శ్రీరామ్ను అడ్డుకున్న పోలీసులు
ABN, First Publish Date - 2022-06-13T21:33:36+05:30
రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చలో కలెక్టరేట్కు టీడీపీ (TDP) పిలుపిచ్చింది.
Anantapuram: రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చలో కలెక్టరేట్కు టీడీపీ (TDP) పిలుపిచ్చింది. అందులో భాగంగా జిల్లా కలక్టరేట్ ముందు ఆందోళనకు టీడీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. దీంతో ముందస్తుగానే టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్య నేతలను నిన్న రాత్రి నుంచి గృహ నిర్భందం చేశారు. మరోవైపు సత్యసాయి జిల్లాలో ఇదే తరహాలో పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పుట్టపర్తి వెళుతున్న మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి పోలీసుల ఆంక్షల మధ్య సునీత పుట్టపర్తి చేరుకున్నారు. అలాగే అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చలో కలెక్టరేట్కు అనుమతి లేదని పోలీసులు చెప్పారు.
Updated Date - 2022-06-13T21:33:36+05:30 IST