Doctors Negligence: వైద్యుల నిర్లక్ష్యంతో వివాహిత మృతి..
ABN, First Publish Date - 2022-07-28T16:57:05+05:30
వైద్యుల నిర్లక్ష్యంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వివాహిత మృతి చెందింది.
అనంతపురం (Anantapuram): వైద్యుల నిర్లక్ష్యం (Doctors Negligence)తో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వివాహిత (Married woman) మృతి చెందింది. యాడికి మండలం, నిట్టూరు గ్రామానికి చెందిన రాణి అనే వివాహిత తీవ్ర కడుపు నొప్పి (Stomach ache)తో బాధపడుతుండడంతో కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆమెను తెల్లవారుజామున ఆస్పత్రి (Hospital)కి తీసుకువచ్చారు. అయితే ఆమె మృతి చెందడంతో డాక్టర్లు సరైన వైద్యం అందించకపోవడం వల్లనే మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తూ రాణి మృత దేహంతో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
Updated Date - 2022-07-28T16:57:05+05:30 IST