ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురంలో జనసేన నేత మధుసూదన్ రెడ్డి పాదయాత్ర

ABN, First Publish Date - 2022-02-14T18:47:05+05:30

ధర్మవరం రెవెన్యూ డివిజన్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: ధర్మవరం రెవెన్యూ డివిజన్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజన పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతోందని మండిపడ్డారు. 1953 ముందు ఏర్పడిన ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పుట్టపర్తి జిల్లాకు పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదన్నారు. ధర్మవరంలోనూ రెవెన్యూ డివిజన్, ఇతర డివిజన్ కార్యాలయాలు కొనసాగే విధంగా ప్రభుత్వం చూడాలని అన్నారు. ఎమ్మెల్యే, ఇతర అధికార పార్టీ నేతలు ఇందుకోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  అవసరమైతే రెవెన్యూ డివిజన్ కోసం న్యాయ పోరాటం చేస్తామని మధుసూదన్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-02-14T18:47:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising