శింగనమల ఎమ్మెల్యే కనబడుటలేదంటూ పోస్టర్...సోషల్ మీడియాలో వైరల్
ABN, First Publish Date - 2022-01-19T13:52:28+05:30
శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కనిపించడం లేదంటూ వెలసిన పోస్టర్ కలకలం రేపుతోంది.
అనంతపురం: శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కనిపించడం లేదంటూ వెలసిన పోస్టర్ కలకలం రేపుతోంది. ‘‘ఎన్నికల్లో ఓటు అడగడానికి వచ్చిన పద్మావతి గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఎక్కడున్నారో తెలియడం లేదు. ఆచూకీ తెలపగలరు. ఇట్లు గుంజే పల్లి గ్రామ ప్రజలు, శింగనమల నియోజకవర్గం’’ అంటూ పోస్టర్లో పేర్కొన్నారు. తమ గోడు వినిపించుకోకపోవడంతో ఇలా పోస్టర్ వేశామని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై ఎమ్మెల్యే పద్మావతి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.
Updated Date - 2022-01-19T13:52:28+05:30 IST