ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సులో నుంచి పడి వృద్ధుడి మృతి

ABN, First Publish Date - 2022-08-16T06:27:05+05:30

కదిరి మండలం కొండమ నాయునిపాళ్యం వద్ద సోమ వారం ఆర్టీసీ బస్సులో నుంచి పడి ఓ వృద్ధుడు మృతి చెం దాడు.

ఈశ్వర్‌రెడ్డి(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కదిరి అర్బన, ఆగస్టు15: కదిరి మండలం కొండమ నాయునిపాళ్యం వద్ద సోమ వారం ఆర్టీసీ బస్సులో నుంచి పడి ఓ వృద్ధుడు మృతి చెం దాడు. మృతిడి కుమారుడు నరసింహారెడ్డి పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లచెరువు మం డలం బండ్రేపల్లికి చెందిన ఈశ్వర్‌రెడ్డి(70) సోమవారం కదిరి మండలం ఏకాల చెరువుపల్లిలోని తన కుమార్తె ఇంటికి వెళ్తున్నాడు. కొండమనాయునిపాళ్యం వద్ద బస్సులో కండక్టర్‌ సీటు వద్ద నిలబడి ఉన్నాడు. బస్సు మలుపు తిరిగేటప్పుడు పట్టు తప్పి కింద పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన ఆయనను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలి స్తుండగా మార్గమద్యంలో మృతిచెందాడు, డైవర్‌ నిర్లక్ష్యం వల్లనే తన తండ్రి మృతి చెందినట్లు ఆయన  ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుస్తున్నట్లు సీఐ రియాజ్‌అహమ్మద్‌ తెలిపారు. 


Updated Date - 2022-08-16T06:27:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising