ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు

ABN, First Publish Date - 2022-07-06T23:54:52+05:30

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుకొండ: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. వాహనదారుల నుంచి ప్రైవేట్‌ వ్యక్తుల ద్వారా అక్రమంగా వసూలు చేసిన రూ.85,670 నగదును స్వాధీనం చేసుకున్నారు. విధినిర్వహణలో ఉన్న ఎంవీఐ శ్రీకాంత్‌, ఇద్దరు ప్రైవేట్‌ వ్యక్తులపై కేసు నమోదు చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు ప్రభాకర్‌, మోహన్‌ ప్రసాద్‌, హేమంత్‌ కుమార్‌ రెడ్డి, శంకర్‌రెడ్డి, శాంతిలాల్‌, శివ, గంగాధర్‌ తదితరులు చెక్‌పోస్టుపై దాడులు నిర్వహించారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు తనిఖీ చేశారు. ఆధారాలు లేని నగదును, రికార్డు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. పెనుకొండకు చెందిన మూర్తి, గోపాల్‌ అనే ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల ద్వారా వాహనదారుల నుంచి ఎంవీఐ డబ్బులు వసూలు చేయించినట్లు గుర్తించామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. వారిద్దరినీ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

Updated Date - 2022-07-06T23:54:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising