ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యానను ఢీకొన్న కారు - ఒకరి దుర్మరణం

ABN, First Publish Date - 2022-09-24T04:59:13+05:30

పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయల సర్కిల్‌ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం రాత్రి ముందు వెళ్తున్న వ్యానను కారు వేగంగా ఢీకొంది.

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుకొండ రూరల్‌, సెప్టెంబరు 23: పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయల సర్కిల్‌ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం రాత్రి ముందు వెళ్తున్న వ్యానను కారు వేగంగా ఢీకొంది. ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన కిరణ్‌ (50) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురు గాయపడ్డారు. ఎస్‌ఐ రమే్‌షబాబు తెలిపిన వివరాలివి. హైదరాబాద్‌ తుక్కగూడ ప్రాంతానికి చెందిన రియల్‌ వ్యాపారి కిరణ్‌ స్నేహితులతో కలిసి గ్రానైట్‌ కొనుగోలుకు కారులో బెంగళూరుకు వెళ్లారు. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో కారు లో వస్తున్నారు. పెనుకొండ సమీపంలోకి రాగానే కారు బ్రేక్‌డౌన కా వడంతో  ముందు వెళ్తున్న ఐచర్‌ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొన్నా రు. ప్రమాదంలో కిరణ్‌ కారు సీటులోనే మృతి చెందగా, ధర్మసింగ్‌, శ్రీకాంత, శోబన, డ్రైవర్‌ వెంకటేశ గాయడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్సలో పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీ వ్రంగా గాయపడిన ధర్మసింగ్‌, శ్రీకాంతలను మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. అతివేగంగా వస్తున్న కారుకు బ్రేక్‌ ఫెయి ల్‌ కావడంతో ముందు వెళ్తున్న ఐచర్‌ వాహనాన్ని ఢీకొనడంతో ప్ర మాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేర కు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2022-09-24T04:59:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising