మీ వాలంటీర్ చెప్పుతో కొట్టుకున్నాడు: నక్కా Anandababu
ABN, First Publish Date - 2022-06-21T20:02:54+05:30
జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేత నక్కా ఆనందబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Amaravathi: ఈ ఉద్యోగం వద్దంటూ వాలంటీర్ (Volunteer) తన చెప్పుతో తనే కొట్టుకున్నాడని, ఇదనే ప్రభుత్వం సమర్థత అని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు (Anandababu) ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి(Kadiri) మండలం, రామదాస్ నాయక్ తండాలో 50 మంది రైతులు ఈ క్రాప్ చేయిస్తే.. ఒక్క రైతుకే పంట బీమా అందిందని, రైతు ప్రభుత్వం అని చెప్పుకునే సీఎం జగన్ (Jagan).. రైతులకు చేస్తున్నది ఇదేనా? అని నిలదీశారు. అవగాహనా రాహిత్యంతో అధికారులు మాట్లాడుతున్నారని ఆనందబాబు మండిపడ్డారు.
Updated Date - 2022-06-21T20:02:54+05:30 IST