ప్రతిపక్షాలపై ఆనం మండిపాటు
ABN, First Publish Date - 2022-04-08T22:23:44+05:30
ప్రతిపక్షాలపై ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి మండిపడ్డారు. సీఎం జగన్ నుంచి కిందిస్థాయి నేతల వరకు..
నెల్లూరు: ప్రతిపక్షాలపై ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి మండిపడ్డారు. సీఎం జగన్ నుంచి కిందిస్థాయి నేతల వరకు.. ప్రతి ఒక్కరిని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేసే ప్రతి పనిని ప్రతిపక్షాలు, శ్రీలంక ఆర్థిక పరిస్థితితో పోల్చుతున్నాయని తప్పుబట్టారు. ఐదున్నర కోట్లమంది ప్రజలు ఉన్న ఈ రాష్ట్రంలో.. సంక్షేమం ఏనాడూ వెనుకబడలేదని తెలిపారు. లక్షా 20 వేల కోట్లతో ప్రజా సంక్షేమం కోసం బడ్జెట్ పెట్టామని చెప్పారు. ప్రజలంతా ప్రతిపక్షాలను నిలదీయాలని రాంనారాయణరెడ్డి పిలుపునిచ్చారు.
Updated Date - 2022-04-08T22:23:44+05:30 IST