అభివృద్ధి కోసమే పోరాటం: అమరావతి రైతులు
ABN, First Publish Date - 2022-04-14T02:43:41+05:30
తమ పోరాటం అభివృద్ధి కోసమైతే.. పాలకులు ఆరాటం అందినకాడికి దోచుకోవడమని అమరావతి రైతులు అన్నారు.
తుళ్లూరు: తమ పోరాటం అభివృద్ధి కోసమైతే.. పాలకులు ఆరాటం అందినకాడికి దోచుకోవడమని అమరావతి రైతులు అన్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి కొనసాగించాలని, బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్, హైకోర్టు తీర్పును గౌరవించి అమలు పరచాలని రైతులు చేస్తోన్న ఆందోళనలు బుధవారం నాటికి 848వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ మూడు రాజధానులని చెప్పి విశాఖలో కారు చౌకగా కొన్న భూముల విలువ పెంచుకోవాలని పాలకులు చూశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే ఆలోచన సీఎం జగన్రెడ్డికి, ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు లేదన్నారు.
Updated Date - 2022-04-14T02:43:41+05:30 IST