ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అమరావతి పనులు చేపట్టాలి’

ABN, First Publish Date - 2022-03-17T00:01:08+05:30

భావితరాల భవిష్యత్‌ కోసమే అమరావతి అన్న హైకోర్టు తీర్పుతోనైనా అభివృద్ధి పనులను చేపట్టాలని రైతులు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుళ్లూరు: భావితరాల భవిష్యత్‌ కోసమే అమరావతి అన్న హైకోర్టు తీర్పుతోనైనా అభివృద్ధి పనులను చేపట్టాలని రైతులు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, బిల్డ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు చేస్తోన్న ఆందోళనలు బుధవారం నాటికి 820వ రోజుకు చేరుకున్నాయి. పెదపరిమి, తుళ్లూరు, అనంతవరం, నెక్కల్లు, దొండపాడు, ఉద్దండ్రాయునిపాలెం, వెలగపూడి, మందడం, వెంకటపాలెం, ఐనవోలు తదతర గ్రామాల్లోని ధర్నా శిబిరాల నుంచి మహిళలు, రైతులు, రైతు కూలీలు మాట్లాడుతూ అమరావతి అభివృద్ధితో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. కాని సీఎం జగన్‌రెడ్డి ప్రజల, రాష్ట్ర భవిష్యత్‌ గురించి ఆలోచించకుండా అమరావతిని చంపేయాలని చూశారన్నారు. మూడేళ్ల నుంచి మూడు  రాజధానులు అంటూ అమరావతి అభివృద్ధిని నానబెట్టారని విమర్శించారు. హైకోర్టు తీర్పును వైసీపీ ప్రభుత్వం శిరసా వహించి ఇప్పటికైనా అమరావతి పనులు మొదలు పెట్టాలన్నారు.

Updated Date - 2022-03-17T00:01:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising