816వ రోజుకు అమరావతి రైతుల ఆందోళనలు
ABN, First Publish Date - 2022-03-13T02:12:05+05:30
అమరావతి అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి మెరుగుపడుతుందని రాజధానికి భూములు ఇచ్చిన రైతులు పేర్కొన్నారు.
తుళ్ళూరు: అమరావతి అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి మెరుగుపడుతుందని రాజధానికి భూములు ఇచ్చిన రైతులు పేర్కొన్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధిని కొనసాగించి, కోర్టు తీర్పును అమలు చేయాలని, బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు శనివారంతో 816వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ, ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేసి రాజధాని అభివృద్ధిని కొనసాగించి ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. సీఎం జగన్రెడ్డి మొండి వైఖరి కారణంగా మూడేళ్లుగా అంగళం కూడా అమరావతిలో అభివృద్ధి జరగలేదన్నారు. రాజధాని 29 గ్రామాలలో ఆందోళనలు కొనసాగాయి.
Updated Date - 2022-03-13T02:12:05+05:30 IST