ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

746వ రోజుకు అమరావతి రైతుల ఆందోళనలు

ABN, First Publish Date - 2022-01-02T01:57:08+05:30

ఐదు కోట్ల మంది కోరుకున్న ప్రజా రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం ఎందుకు కాదంటుందని భూములు త్యాగం చేసిన రైతుల ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుళ్లూరు: ఐదు కోట్ల మంది కోరుకున్న ప్రజా రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం ఎందుకు కాదంటుందని భూములు త్యాగం చేసిన రైతుల ప్రశ్నించారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి కొనసాగాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న ఉద్యమం శనివారంతో 746వ రోజుకు చేరుకుంది. నూతన సంవత్సర వేడుకలను కూడా రాజధాని రైతు ధర్నా శిబిరాలలో నిర్వహించారు. ఈ సందర్బంగా వారు  మాట్లాడుతూ, మూడు ముక్కలు చేయాలనే ఆలోచన మానుకోవాలని అన్నారు. ప్రజా రాజధాని అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. 33 వేల ఎకరాలు రాజధాని నిర్మాణ  కోసం ఇచ్చామన్నారు. పాడు బెట్టటానికి కాదన్నారు. రైతులను నడిరోడ్డు మీద నిలబెట్టి  పాలకులు ఆనందం పొందుతున్నారన్నారు.  రైతులతో చర్చించి  సమస్యను పరిష్కరించాల్సి ఉండగా టెర్రరిస్టుల మాదిరిగా అమరావతి రైతులను సీఎం జగన్‌ రెడ్డి చూస్తున్నారని పేర్కొన్నారు. రాజధాని 29 గ్రామాలలో ఆందోళను కొనసాగించారు. అమరావతి వెలుగు కార్యక్రమం దీపాలు వెలిగించి నిర్వహించారు. 

Updated Date - 2022-01-02T01:57:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising