AP News: 18వ రోజుకు చేరిన అమరావతి రైతుల పాదయాత్ర
ABN, First Publish Date - 2022-09-29T15:42:28+05:30
అమరావతి రైతుల మహాపాదయాత్ర 18వ రోజుకు చేరుకుంది.
ఏలూరు: అమరావతి రైతుల మహాపాదయాత్ర 18వ రోజుకు చేరుకుంది. ఈరోజు ఉదయం జిల్లాలోని దెందులూరు మండలం కొవ్వలి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పాదయాత్ర సాగనుంది. శ్రీరామవరం ప్రాంతంలో పాదయాత్రకు వైసీపీ విఘాతం కలిగించే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్ర సాగే దారిపొడవునా పోలీసు బలగాలు భారీగా మోహరించారు.
Updated Date - 2022-09-29T15:42:28+05:30 IST