AP news: అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొనసాగుతున్న వరద ఉధృతి
ABN, First Publish Date - 2022-08-12T18:17:01+05:30
అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతోంది.
రాజమండ్రి: అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద (Flood) ఉధృతి కొనసాగుతోంది. విలీన మండలాల ప్రజలు మూడు రోజులుగా వరద గుప్పెట్లోనే ఉండిపోయాయి. శబరి గోదావరి నదులు శాంతించని పరిస్థితి నెలకొంది. చింతూరు, కూనవరం, విఆర్ పురం మండలాలలో వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారుల పైకి వరదనీరు చేరడంతో ఎక్కడికక్కడ గ్రామాలు దీవులుగా మారాయి. అటు పునరాస శిబిరాలలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు.
Updated Date - 2022-08-12T18:17:01+05:30 IST