గౌతమ్రెడ్డి పేరుతో వ్యవసాయ వర్సిటీ ఏర్పాటు చేయండి
ABN, First Publish Date - 2022-03-03T07:37:42+05:30
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పేరుతో ఉదయగిరిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని మెరిట్స్
ఉదయగిరి రూరల్, మార్చి 2 : దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పేరుతో ఉదయగిరిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం లేఖ రాశారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించారన్నారు. 106.77 ఎకరాల విస్తీర్ణంలో మెరిట్స్ ఇంజనీరింగ్, మేకపాటి వెంకురెడ్డి మెమోరియల్ జూనియర్ కళాశాలలు ఉన్నాయని, తరగతి గదులు, హాస్టళ్లు, ల్యాబ్లు, సిబ్బంది క్వార్టర్స్ ఇలా సుమారు రూ.225 కోట్ల ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తామన్నారు. ఉదయగిరిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు ద్వారా కడప, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల వాసులకు ఎంతో అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.
Updated Date - 2022-03-03T07:37:42+05:30 IST