ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణాలు పోతేపోని అన్నట్లుగా జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు: అచ్చెన్న

ABN, First Publish Date - 2022-03-16T19:14:11+05:30

జంగారెడ్డిగూడెంలో మద్యం మరణాలకు పులుస్టాప్ పెట్టాలని టీడీపీ నేత అచ్చెన్నాయుడు కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జంగారెడ్డిగూడెంలో మద్యం మరణాలకు పులుస్టాప్ పెట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోరారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రాణాలు పోతేపోని అన్నట్లుగా సీఎం జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో షాపులు తగ్గితే మద్యం ఆదాయం తగ్గాలి.. కానీ పెరిగిందన్నారు. చంద్రబాబు పాలనలో మద్యంపై రూ.6 వేల కోట్లు వస్తే.. జగన్ పాలనలో రూ.16.500 కోట్లు వస్తోందన్నారు.


అసెంబ్లీలో ఆధారాలతో సహా నిరూపిస్తే సీఎం జగన్ తప్పుడు మాటలు మాట్లాడారని అచ్చెన్నాయుడు విమర్శించారు. జంగరెడ్డిగూడెంలో సారా దొరికిందని సెబ్ అధికారులే ప్రకటించారన్నారు. సెబ్ అధికారుల ప్రకటనను తాము సభలో ప్రశ్నిస్తే మమ్మల్ని సస్పెండ్ చేశారని, సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్‌ను సస్పెండ్ చేయాలని అచ్చెన్నాయుడు అన్నారు.

Updated Date - 2022-03-16T19:14:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising