ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: మచిలీపట్నంలో పిడుగుపాటుకు ఓ మహిళా వ్యవసాయి కూలి మృతి

ABN, First Publish Date - 2022-09-02T19:25:50+05:30

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పిడుగుపాటుకు ఓ మహిళా వ్యవసాయ కూలీ మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పిడుగుపాటుకు ఓ మహిళా వ్యవసాయ కూలీ మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. కాలేఖాన్ పేటకు చెందిన అర్జా సీతారావమ్మ(35) వ్యవసాయ పనులకు వెళ్లగా ఒక్కసారిగా పడిన పిడుగుపాటుకు అక్కడిక్కడే మృతి చెందింది. పక్కనే ఉన్న మరో ఐదుగురు వ్యవసాయ కూలీలు గాయాలపాలవ్వగా వెంటనే వారి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఐదుగురిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సీతారావమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైసీపీ యువ నాయకుడు పేర్ని కిట్టు పరామర్శించారు.

Updated Date - 2022-09-02T19:25:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising