ఏపీలో కొత్తగా 220 కరోనా కేసులు
ABN, First Publish Date - 2022-02-25T00:36:16+05:30
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్
అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 220 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఏపీలో మొత్తం 23,17,184కు కరోనా కేసులు చేరాయి. ఇప్పటివరకు కరోనాతో 14,720 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 4,927 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 22,97,537 మంది రికవరీ చెందారు.
Updated Date - 2022-02-25T00:36:16+05:30 IST