ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చింతపండు చారు

ABN, First Publish Date - 2021-06-12T22:06:48+05:30

ఇది జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి జీర్ణసంబంధ రోగాలు రాకుండా కాపాడుతుంది. విరోచనం గట్టిగా అవుతున్న వారు రసం రోజూ తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. అన్నంలో కలుపుకొని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇది జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి జీర్ణసంబంధ రోగాలు రాకుండా కాపాడుతుంది. విరోచనం గట్టిగా అవుతున్న వారు రసం రోజూ తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. అన్నంలో కలుపుకొని తినడమే కాకుండా, విడిగా తాగొచ్చు. ఏ కారణం చేతైనా నీరస పడిన వారు ఈ చారును ఆహారంలో ఇవ్వడం వల్ల వెంటనే నీరసం తగ్గుతుంది. 


కావలసినవి: ఒక లీటర్‌ నీళ్లు, పెద్ద ఉసిరికాయంత పరిమాణంలో చింతపండు, పసుపు, ఇంగువ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, బెల్లం, కరివేపాకు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర.


తయారీ విధానం: స్టవ్‌ ఒక పాత్రలో నీళ్లు పెట్టి మరిగిన తరువాత చింతపండు పులుసు, కరివేపాకు వేయాలి. మరికాసేపు మరిగించాలి. తరువాత పసుపు, ఇంగువ వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి ఒక్కొక్క టీస్పూన్‌ వేయాలి. మరో రెండు నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు ఉప్పు, బెల్లం వేసి దింపుకోవాలి. ఈ రసం తాలింపు కోసం పాత్రలో తగినంత నూనె వేసి వేడి అయ్యాక మెంతులు వేసి మాడనివ్వాలి. తరువాత ఎండుమిరపకాయలు, ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడిన తరువాత జీలకర్రవేయాలి. ఈ తాలింపును చారులో కలుపుకోవాలి.

Updated Date - 2021-06-12T22:06:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising