రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారు: షర్మిల
ABN, First Publish Date - 2021-10-27T00:28:18+05:30
సీఎం కేసీఆర్పై వైఎస్సార్ టీపీ అధినేత షర్మిల తీవ్రస్థాయిలో
హైదరాబాద్: సీఎం కేసీఆర్పై వైఎస్సార్ టీపీ అధినేత షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాప్రస్థానం యాత్రలో ఆమె ఈ విమర్శలు చేసారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని షర్మిల ఆరోపించారు. మాట తప్పితే రాళ్లతో కొట్టమన్నారని, ఇప్పుడు ఏం చేయాలో కేసీఆర్ చెప్పాలని షర్మిల డిమాండ్ చేసారు. అమెరికా నుంచి ఊడిపడ్డ కేసీఆర్ బిడ్డలకే ఉద్యోగాలా అని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ కోసం కొట్లాడిన విద్యార్థులకు ఆత్మహత్యలా అని షర్మిల అన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకుంటే కేసీఆర్ రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేసారు.
Updated Date - 2021-10-27T00:28:18+05:30 IST