చిన్నారులతో సందడి చేసిన వైఎస్ షర్మిల.. వీడియో వైరల్
ABN, First Publish Date - 2021-08-25T00:54:34+05:30
వైఎస్సీర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరాహార దీక్ష మంచిర్యాల నియోజకవర్గం, దండేపల్లి మండలంలో జరిగింది. నిరుద్యోగుల కోసం ఆమె ప్రతీ మంగళవారం నిరాహార దీక్ష చేపడుతున్నారు....
ఆదిలాబాద్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరాహార దీక్ష మంచిర్యాల నియోజకవర్గం, దండేపల్లి మండలంలో జరిగింది. నిరుద్యోగుల కోసం ఆమె ప్రతీ మంగళవారం నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఇందులో భాగంగా వైఎస్ షర్మిల ఈ మంగళవారం దండేపల్లి మండలంలో నిరాహార దీక్షకు దిగారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి భూక్యా నరేష్ నాయక్కు షర్మిల నివాళులర్పించారు. ‘జోహార్ భూక్యా నరేష్ నాయక్ ‘అంటూ నినాదాలు చేశారు. అయితే దీక్షలో వైఎస్ షర్మిల చిన్నారులతో సందడి చేశారు. ఓ పసి పాపను తన ఒడిలో పెట్టుకుని మరో చిన్నారితో మాట్లాడుతూ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Updated Date - 2021-08-25T00:54:34+05:30 IST