భక్తజన సంద్రం.. యాదాద్రిక్షేత్రం
ABN, First Publish Date - 2021-11-28T01:50:15+05:30
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం శనివారం భక్తజన సంద్రాన్ని తలపించింది. కార్తీక మాసం... వారాంతం కావడంతో వివిధ
యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం శనివారం భక్తజన సంద్రాన్ని తలపించింది. కార్తీక మాసం... వారాంతం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో మొక్కులు తీర్చుకున్నారు. మొక్కుపూజల నిర్వహణ కోసం క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. ధర్మ దర్శనాలకు నాలుగు గంటలు.. ప్రత్యేక దర్శనాలకు రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. బాలాలయంలో నిత్య కల్యాణోత్సవం, ఆర్జిత సేవలు, కొండకింద పాత గోశాలలోని వ్రత మండపంలో సత్యనారాయణ వ్రతపూజలలో భక్తులు కుటుంబసమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామికి ప్రసాదాల విక్రయం ద్వారా రూ.6.01లక్షలు, వ్రతపూజల ద్వారా రూ.3.33లక్షల ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. విఇధ విభాగాల ద్వారా రూ.23,23,642 ఆదాయం దేవస్థాన ఖజానాలో జమయ్యినట్టు అధికారులు పేర్కొన్నారు.
Updated Date - 2021-11-28T01:50:15+05:30 IST